Gayathri: తెలుగు స్టార్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటీ..? ఎవరో గుర్తుపట్టారా..?
Gayathri Raghuram: సినీఇండస్ట్రీ రంగుల ప్రపంచం లాంటిది హవా ఉన్నంత కాలం మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు. గతంలో చాలామంది హీరోయిన్లు వయస్సు పైబడిపోయే వరకు ఇండస్ట్రీలో కొనసాగారు. కానీ నేటి కాలంలో హీరోయిన్లు 1,2 సినిమాల్లో నటించి ఆ తర్వాత మారిపోతున్నారు. అయితే కొందరు ఈ 1,2 సినిమాలతోనే స్టార్లుగా మారుతున్నారు. కానీ ఆ తర్వాత గుర్తు పట్టకుండా తయారు అవుతున్నారు. లేటెస్ట్ గఓ హీరోయిన్ గుండు చేయిచుకొని మరి అందరికీ షాక్ ఇచ్చింది. ఈమె పేరు గాయత్రి రఘురామ్(Gayathri Raghuram).
ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా ఆమెకి గుర్తింపు వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా? 2001లో రేపల్లెలో రాధా అనే సినిమా గుర్తుందా? ఎవరికి గుర్తుండకపోవచ్చు ఎందుకంటే ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. కానీ ఆ తర్వాత 2003లో బాపు బొమ్మకు పెళ్లంట అనే సినిమా వచ్చింది కదా. ఇందులో రెండు జడలు వేసుకొని కుందనపు బొమ్మలా ఉన్న అమ్మాయి ఈమె. ఈమె పేరు గాయత్రి రఘురామ్ బాపు బొమ్మ సినిమాతో ఫేమస్ అయిన గాయత్రీ తెలుగులో నటించలేదు. కానీ కొన్ని తమిళ సినిమాల్లో నటించింది.(Gayathri Raghuram)
అయితే కొంతకాలం 2004నుంచి 2010వరకు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ప్రత్యేక సాంగ్స్లో నటించింది. మరికొన్ని సినిమాల్లో సహాయక పాత్రలో మెరిసింది. అయితే 2021లో నితిన్ మూవీ రంగడే సినిమాలో హీరో సోదరిగా నటించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. 2006సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తర్వాత గాయత్రి, దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 2010లో ఆయనకు గాయత్రి విడాకులిచ్చి ఇదే ఏడాదిలో బీజేపీలో చేరిన ఆమె కొంతకాలం పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చారు.
దీంతో మరోసారి ఆమెకు సినీ ఇండస్ట్రీపై ఇష్టం ఏర్పడింది. ఈ క్రమంలో అవకాశం వచ్చిన చిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోంది. గాయత్రి రఘురాం లైఫ్ లో అన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన సందర్భంగా ఆమె కొన్ని ఫోటోలు తీయించుకుంది. ఆ ఫోటోలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రాజకీయాలలో ప్రసిద్ధి చెందిన గాయత్రి రఘురామ్ ఇటీవల తన అభిమానులు అనుచరుల దృష్టిని ఆకర్షించిన ధైర్యమైన పరివర్తనకు గురైంది.
సోషల్ మీడియాలో తన యాక్టివ్ ప్రెజెన్స్కు గుర్తింపు పొందిన నటి, తన కొత్త లుక్ యొక్క క్లిప్ను పంచుకుంది, ఇది ప్రతి ఒక్కరినీ ఆసక్తిగా మరియు స్ఫూర్తినిచ్చింది. వీడియోలో, గాయత్రి రఘురామ్ ఆమె కొత్తగా షేవ్ చేసిన బట్టతల లుక్లో కనిపించింది, ఇది పొడవాటి జుట్టుతో ఆమె మునుపటి రూపానికి భిన్నంగా ఉంది. ఆమె పాస్టెల్ పింక్ ప్రింటెడ్ కుర్తా సెట్ని ధరించింది. నెమలి ఈకను పట్టుకుని తన నుదుటిపై టికాతో అలంకరించుకుంది.