Nithya Menon: ఖాళీగా ఉన్నా పెళ్లి చేసుకుంటా.. పెళ్లి గురించి నిత్యామీనన్ కామెంట్స్..
Nithya Menon Comments: అందం, అభినయంతో పాటు టాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ నిత్యా మీనన్. నిత్యా మీనన్ కి సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఆకట్టుకుంది నిత్య. నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాతో నిత్యా మీనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ చిన్నది వరుస సినిమాలతో దూసుకుపోయింది. తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. తెలుగులో చాలా మంది హీరోల సరసన నటించింది నిత్యా.
అలాగే తమిళంలో దళపతి విజయ్, సూర్య, ధనుష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్, మలయాళంలో సహా అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు నిత్య. తాజాగా నిత్యామీనన్ తన పెళ్లి ప్లాన్ గురించి మాట్లాడింది. హీరోయిన్స్ పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి నిత్యామీనన్ పెళ్లి గురించి కూడా ఇప్పటికే చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. తాజాగా తన పెళ్లి గురించి స్పందించింది నిత్యామీనన్. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని తేల్చి చెప్పేసింది ఈ బబ్లీ బ్యూటీ(Nithya Menon Comments).
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూ నేను మంత్రి స్థాయికి ఎదిగారు. నేనేం చేయాలి మరి ఎవరు చెప్పాలి అని నేను అనుకోను. నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకున్నారు. వారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. నేను స్వేచ్ఛ లేకుండా జీవించలేను. అది వాళ్ళకి తెలుసు అని తెలిపింది నిత్య. అలాగే నిత్య మాట్లాడుతూ మా అమ్మమ్మ బతికి ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేది పాపులర్ నటి అయి నన్ను ఆమె పెళ్లి చేసి పెళ్లి చేసుకోమని గోలచేసేది నువ్వేం చేస్తున్నావ్ నువ్వు పెళ్లి చేసుకోకూడదని.(Nithya Menon Comments)
మా అమ్మమ్మ నన్ను అడుగుతూనే ఉండేది. ఆమె ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఆమె తప్ప మరెవరూ ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు అని నిత్యా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యా మీనన్ సినిమాలతో పాటు వెబ్సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది. నిత్యా మీనన్కి ఇప్పుడు తెలుగులో అవకాశాలు రావడం లేదన్న సంగతి తెలిసిందే. ఆమె చివరిగా భీమ్లా నాయక్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ నటించలేదు. నిజానికి అంతకు ముందు కూడా తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి.
ఈ క్రమంలో తెరపై హోస్ట్గా బిజీ అయిపోయింది. అదే సమయంలో, ఆమె ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టింది. అయితే రెండు మూడు సినిమాలు తప్ప ఆమె పెద్దగా చేసినట్టు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్లపై కూడా దృష్టి పెట్టనున్నారు. ఇటీవలే కుమారి శ్రీమతి సిరీస్లో నటించింది. ఇది ప్రత్యేక శ్రద్ధను పొందుతుంది. ఈ సందర్భంగా నిత్యా మీనన్ తన.