Ramya Krishnan: మద్యం మత్తులో రచ్చ రచ్చ చేసిన నటి రమ్య కృష్ణ.. అలాంటి పనులు కూడా..
Ramya Krishnan Radhika: నటి రమ్యకృష్ణ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఆమె తన సినిమా విశేషాలతో వార్తల్లో నిలిస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆమె వరుస వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలుస్తున్నారు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలను. నటి రమ్యకృష్ణ ఖండించారు. బండారు సత్యనారాయణ చేసిన కామెంట్స్ కి రమ్యకృష్ణ కౌంటర్ ఇచ్చారు. సమాజంలో మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు ఆమె. రోజాకి మద్దతుగా నిలవడంతో టీడీపీ క్యాడర్ రమ్యకృష్ణను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
గతంలో చెన్నైలో మద్యం బ్యాన్ ఉన్న సమయంలో రమ్యకృష్ణ కారులో భారీ ఎత్తున మద్యం సీసాలు దొరికాయి. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ పాత వీడియోను టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తూ రమ్యకృష్ణ ట్రోల్ చేశారు. ఈ ఘటన మరువకముందే మరో వివాదంలో రమ్యకృష్ణ చిక్కుకున్నారు. ఇటీవలే రమ్యకృష్ణ పుట్టినరోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రమ్యకృష్ణ క్లోజ్ ఫ్రెండ్స్ హాజరయ్యారు. నటి రాధిక, రమ్యకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేశారు(Ramya Krishnan Radhika).
అయితే ఈ ఫొటో బ్యాక్ గ్రౌండ్ ను ఈసారి నిశితంగా పరిశీలిస్తే అది పబ్ అని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాకుండా రమ్యకృష్ణ చేతిలో మందు గ్లాస్ ఉన్నట్లు ఈ ఫోటో చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది. బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఇద్దరు బాగా ఎంజాయ్ చేసినట్లుగానే కనిపిస్తున్నారు. రమ్యకృష్ణను గట్టిగా హద్దుకున్న రాధిక ఆమె బుగ్గలపై ముద్దులు ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి. వైసీపీ మంత్రి-నటి రోజాపై టీడీపీ బండారు సత్యనారాయణ చేసిన వివాదాస్పద.(Ramya Krishnan Radhika)
వ్యక్తిగత వ్యాఖ్యలు ఆయనను అరెస్ట్ చేశాయి. ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ. తనపై దాడికి పాల్పడి తన పేరు చెప్పుకునే బండారు సత్యనారాయణ లాంటి వ్యక్తుల ఆలోచనా ధోరణిని తీవ్రంగా ఖండించారు. మొన్న, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ టీడీపీ నాయకుడి ప్రకటనలను మరియు ప్రజా జీవితంలో మహిళలపై తన పాత్ర గురించి దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తూ బయటకు వచ్చారు. మరో నటి ఖుష్బు సుందర్ బండారు స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని ఖండిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రోజా స్నేహితురాలు అనే కారణంతోనే ఆమెకు మద్దతుగా నిలిచానని. ఓ మహిళగా రోజా బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు పోరాడతానని కుష్బు పేర్కొంది. రోజాకు మద్దతుగా మరో సీనియర్ రమ్యకృష్ణ ఈరోజు రోజాపై బండారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆ వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోదీని కోరారు.