Trivikram : త్రివిక్రమ్ మహేష్ బాబు కంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?
Trivikram Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అటడు, ఖలేజా వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలు కమర్షియల్ హిట్ కాలేదు. కానీ అభిమానులను మాత్రం ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతోంది. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో `గుంటూరు కారం` అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.
అలాగే పూజా హెగ్డే తప్పుకోవడంతో మరొక హీరోయిన్ ను తీసుకున్నారట. ఇదంతా ప్రచారం మాత్రమే. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకలన రాలేదు. ఇదంతే పక్కన పెడితే.. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఫిట్నెస్ విషయంలో మహేశ్ బాబు స్ఫూర్తిదాయకంగా కొనసాగుతున్నారు. ఇది వారాంతం లేదా సెలవుదినం అనే దానితో సంబంధం లేకుండా, అతను తన జిమ్ రొటీన్కు కట్టుబడి ఉంటాడు(Trivikram Mahesh Babu).
ఇటీవల, అతను తన తీవ్రమైన శనివారం వర్కౌట్ సెషన్ యొక్క సంగ్రహావలోకనం ఇచ్చే వీడియోను పంచుకున్నాడు మరియు ఆలస్యం చేయకుండా జిమ్కు వెళ్లమని అతని అభిమానులను ప్రేరేపించాడు. నిస్సందేహంగా, మహేష్ బాబు ఫిట్నెస్ లక్ష్యాలను నిర్దేశించుకుంటాడు మరియు అందరికీ స్ఫూర్తిదాయకంగా పనిచేస్తున్నాడు. ఫిట్నెస్ పట్ల అతని అంకితభావం అతని తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో స్పష్టంగా కనిపిస్తుంది, అక్కడ అతను జిమ్లో తన చేతి వ్యాయామాన్ని ప్రదర్శిస్తాడు. అయితే నిజానికి గుంటూరు కారం కంటే ముందే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మిస్ అయింది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. `అ ఆ`.
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో నితిన్, సమంత జంటగా నటించారు. అనుపమ పరమేశ్వరన్ సెకెండ్ హీరోగా చేసింది. నదియా, నరేష్, రావు రమేష్, హరితేజ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని కూడా హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణనే నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ లవ్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2016లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.(Trivikram Mahesh Babu)
అయితే నిజానికి ఈ మూవీ మొదట త్రివిక్రమ్ మహేష్ బాబు వద్దకు తీసుకెళ్లాడట. అయితే కథ నచ్చినప్పటికీ.. తన ఇమేజ్ కు సరిపోదని చెప్పి మహేష్ `అ ఆ` మూవీని రిజెక్ట్ చేశాడట. దాంతో నితిన్ కథలోకి వచ్చాడు. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.