Jyothi Raj: నా మొగుడిని చేతకాని వాడిని చేసావ్.. దయచేసి ఆయన్ని వదిలేయ్ ప్రశాంత్..
Sandeep Wife Jyothi Emotional: బిగ్బాస్ సీజన్ 7 లో ఆట సందీప్ కంటెస్టెంట్గా అడుగు పెట్టాడు. మొదటి వారంలో పవర్ అస్త్ర సాధించి ఇంటి సభ్యుడయ్యాడు. ఐదు వారాల ఇమ్యూనిటీ పొందాడు. ముందు నుంచే టాస్కుల్లో తన సత్తా చూపిస్తున్నాడు. స్టార్ మాలో ప్రసారమైన నీతోనే డాన్స్ అనే షోలో తన భార్యతో కలిసి పార్టిసిపేట్ చేశాడు. డాన్స్ షోలో విన్నర్గా నిలిచారు సందీప్, జ్యోతి రాజ్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన జ్యోతి రాజ్, సందీప్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. తమపై పల్లవి, ప్రశాంత్ సపోర్ట్ చేస్తున్న ట్రోల్స్పై స్పందించారు.
జ్యోతి రాజు మాట్లాడుతూ రియాలిటీ షో అయినకి కొత్త కాదు. ఒక సారి దిగారంటే కప్ కొట్టాల్సిందే. బిగ్ బాస్ అనేది ఒక కొత్త అనుభవం డాన్స్ వేరు రియాలిటీ షో వేరు సందీప్ ఎవరితో కలవడానికి కాస్త టైమ్ తీసుకుంటారు. అతను ఇంట్రోవ్ర్ట్ మాకు ఒక డ్రీమ్ ఉంది. అందుకోసమే బిగ్ బాస్కి వెళ్ళాము అని నిర్ణయించుకున్నామని చెప్పింది జ్యోతి. సందీప్ ఫైనల్ గా పెద్ద హీరోలతో కొరియోగ్రఫీ చేయాలనే ఆశ అని చెప్పింది. తన భర్తపై వస్తున్న నెగటివ్ ట్రోల్స్పై స్పందించింది జ్యోతి. ప్రశాంత్ కి వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు ఇంకా చెడగొడుతున్నారు(Sandeep Wife Jyothi Emotional).
మమ్మల్ని చాలా హర్ట్ చేతున్నారు. మాపై అసభ్యకరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందులోకి ఫ్యామిలీని లాగడం మంచిదేనా? అంటూ నేను ఒక వీడియో పెట్టాను. అందుకు నీ మొగుడు వేస్ట్ అంటూ చెప్పుకోలేని మాటలు అన్నారు. ప్రశాంత్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ప్రశాంత్ జోలికి వస్తే మిమ్మల్ని వదలము. నీ మొగుడికి చెప్పు ప్రశాంత్ జోలికి రావద్దని ఇంకా చెప్పుకోలేని మాటలు అన్నారు అంటూ జ్యోతి ఎమోషనల్ అయ్యింది. దీనివల్ల ఎవరికీ చెడ్డ పేరు తమ్ముడు ప్రశాంత్కు కదా. అతను లోపలకు వెళ్లేటప్పుడు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి వెళ్ళాడు.(Sandeep Wife Jyothi Emotional)
కానీ వీళ్లంతా కలిసి వారిని ఎలిమినతె చేసేలా ఉన్నారు. వీళ్లంతా కలిసి ప్రశాంత్ కి బ్యాడ్ నేమ్ తెస్తున్నారని చెప్పుకొచ్చింది జ్యోతి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో తాజా సంఘటనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆట చివరకు ఉత్తేజకరమైన పనులు మరియు సమస్యలతో సమం చేయబడింది. శోభా శెట్టి, శివాజీ మరియు భోలే శంకర్ ఇంట్లో వారి ప్రవర్తన మరియు వ్యూహాల కోసం ఎల్లప్పుడూ లైమ్లైట్గా ఉంటారు.
అయితే, అల్టా-పుల్టా సీజన్లో, విషయాలు ఎల్లప్పుడూ అనూహ్యంగా ఉంటాయి. కాలక్రమేణా, అమర్దీప్, టేస్టీ తేజ మరియు గౌతమ్ తమ ఆటను మెరుగుపరుచుకున్నారు.