Sivaji: బిగ్ బాస్ లో శివాజీ మాస్టర్ ప్లాన్.. ఈ దెబ్బతో వాళ్ళు అవుట్..
Sivaji Master Plan: బిగ్ బాస్ తాజా ఎపిసోడ్లో నీటిపై తేలేవీ నీటిలో మునిగేవి అనే టాస్క్ ఇచ్చారు. నలుగురు సభ్యులు ఇందులో పాల్గొనాలి. ఇందులో గెలిచిన వారు కెప్టెన్సీ రేసులో ఉన్నారు. మొదటి శోభ శెట్టి, ప్రియాంకా, అమరదీప్, టేస్టీ తేజ వచ్చారు. సంచాలకుడిగా గౌతమ్ ని ఎన్నుకున్నారు. అయితే ఇందులోనూ అమర్ బిస్కెట్ అయ్యాడని చెప్పాలి. ఫస్ట్ ప్లేస్ లో ప్రియాంక నిలిచింది. తర్వాత శోభా తర్వాత టెస్ట్ తేజ చివరగా అమర్ దీప్ తర్వాత పెట్టిన బాక్సుల టాస్క్ లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అమర్, గౌతమ్ తర్వాత స్థానాల్లో రతిక చివర నిలిచింది.
ఇక బిగ్ బాస్ హౌస్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. శివాజీ బ్యాచ్ అంతా ఒకవైపున సీరియల్ బ్యాచ్ అంతా మరోవైపునట్లుగా కనిపిస్తోంది. కొత్తగా వచ్చిన శవాలై, అశ్వినీ కూడా శివాజీ టీమ్లో చేరినట్లు తెలుస్తుంది. నామినేషన్ గురించి శివాజీ మాట్లాడారు. నామినేషన్ అనేసరికి ఎవరైనా తిడితే హీరో అవుతామనే ఫీలింగ్తో రకరకాలుగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చాడు శివాజీ. ఏమీ లేకపోయినా యెగిరి యెగిరి పడుతున్నాయి కొన్ని విస్తరాకులు అనే సామెత చెప్పాడు. ఇది గొప్ప హాస్ అని నామినేషన్స్ని తెలివైన ప్రక్రియని అభహాస్యం చేస్తున్నట్లుగా పేర్కొన్నాడు(Sivaji Master Plan).
స్ట్రాటజీతో వచ్చారని మొదటివారమే గమనించినట్లుగా మాట్లాడాడు.ఈ విషయం ఎవరు అడిగినా చెబుతానని తెలిపారు. శివాజీ బయట చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో అతని ప్రవర్తన చూసి అభిమానులు ఎక్కువ అయ్యారు. శివాజీ చేసిన ఈ కామెంట్ సీరియల్ బ్యాచ్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని. శోభా శెట్టి కూడా నామినేషన్ షాక్ తగిలింది. తేజ తో మాట్లాడుతూ నేను కరెక్ట్ గానే ఉన్నానా అని అడిగింది. నేను శివాజీతో బానే మాట్లాడుతున్న ఆయన అంటే ఎప్పటికి గౌరవం ఉంటుంది. నేను రాంగ్ బిహేవ్ చేస్తున్న నా అని అడిగింది.(Sivaji Master Plan)
నేను సెట్లోకి వెళ్తే నన్ను అందరూ రెస్పెక్ట్ చేస్తారు. నాకు చాలా గౌరవం ఉందని. బయట నుంచి వచ్చిన ఓ వ్యక్తి మెంటల్ అంటే తట్టుకోలేక పోతున్నాను అని తెలిపింది. అయితే శోభ శెట్టి ఇలా మాట్లాడేలా చెయ్యడం శివాజీ స్ట్రాటజీ అంటున్నారు జనాలు. తనపై తనకి అనుమానం వచ్చేలా శివాజీ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు.
సీరియల్ బ్యాచ్ మీద శివాజీ పెద్ద ప్లాన్ వేసినట్లుగా చర్చించుకుంటున్నారు. ప్రియాంక, శోభ శెట్టి, సందీప్, అమర్దీప్ కూడా కాసేపు మాట్లాడుకున్నారు. ఎదుటివారిని మాట్లాడకుండా ఉండలేక చేయడం వారి ప్లాన్ అని సందీప్ చెప్పుకొచ్చాడు.