Pawan Kalyan : ఆ స్టార్ హీరో హిట్ సినిమాను రీమేక్ చేస్తా అంటే తిట్టిన చిరంజీవి.. ఎందుకంటే..?
Pawan Kalyan Remake Movie : ఒక భాషలో విడుదలైన సినిమాను మరో భాషలో రీమేక్ చేయడం మామూలే. తెలుగులో రీమేక్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన సినీ కెరీర్లో చాలా సినిమాలను రీమేక్ చేయడమే కాదు.. విజయం కూడా సాధించాడు. అయితే ఒకప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయాలని పవన్ కళ్యాణ్ అనుకున్నారు. “బాషా` మరెవరో కాదు, పవన్ కళ్యాణ్ రీమేక్ చేయాలని చూసిన రజనీకాంత్ సినిమా.
సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. రజనీకాంత్ స్టార్డమ్ని పెంచిన సినిమా ఇదే. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం 1995లో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఏడాదికి పైగా ఆడిన ఈ సినిమా రూ. 38 కోట్ల రేంజ్లో కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో తెలుగులోనూ రజనీకాంత్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. బాషా తర్వాత తమిళంలో రజనీకాంత్ నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతోంది(Pawan Kalyan Remake Movie).
అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. కానీ, తెలుగు హక్కుల డీల్ కుదరకపోవడంతో డబ్ చేసి విడుదల చేశారు. కానీ, 2010లో పవన్ కళ్యాణ్ ‘బాషా’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. నేటి ప్రేక్షకులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి బాషాను తెరకెక్కించాలనుకున్నాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా అప్పట్లో ప్రారంభించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి. వెంటనే పవన్ కళ్యాణ్ ను పిలిచి తిట్టారట. బాషా ఆల్ టైం క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా.(Pawan Kalyan Remake Movie)
ఆల్రెడీ ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్ ను తెలుగు ప్రేక్షకులు సైతం ఎగబడి మరీ చూసేశారు. అలాంటి సినిమాని రీమేక్ చేయాలనుకోవడం పెద్ద టైమ్ వేస్ట్ పని అని పవన్ కళ్యాణ్ కు బ్రెయిన్ వాష్ చేశారట. దాంతో బాషా రీమేక్ చేయాలన్న ఆలోచనను పవన్ విరమించుకున్నాడట. మెగా అభిమానులందరికీ ఇదిగో ఒక సంతోషకరమైన వార్త.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బ్రో యొక్క మోస్ట్ ఎవైటెడ్ టీజర్ నిన్న సాయంత్రం 05:04 గంటలకు విడుదల అయ్యింది . ఈ అప్డేట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
టీజర్ విడుదలకు సంబంధించి మేకర్స్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు మధ్యాహ్నం టీజర్ కోసం డబ్బింగ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. రానున్న రోజుల్లో ప్రమోషన్ల జోరు పెంచేందుకు టీమ్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు.
ఈ ఫాంటసీ కామెడీకి సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో టిజి విశ్వ ప్రసాద్ ఈ బిగ్గీకి మద్దతు ఇస్తున్నారు. థమన్ సమకూరుస్తున్నారు. బ్రో జూలై 28, 2023న రానుంది.