Rajamouli: జూనియర్ ఎన్టీఆర్ ని మీ గొడవల్లోకి లాగొద్దు.. దర్శకుడు రాజమౌళి సంచలన వ్యాఖ్యలు..
Director Rajamouli: టీడిపి చీఫ్ చంద్రబాబు అరెస్ట్పై సినిమా వాళ్లు స్పందించకపోతే పట్టించుకోనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకుంటే ఐ డోంట్ కేర్ అని కామెంట్ చేశారు. తాము కేసులు, అరెస్టులకు భయపడమని న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటామన్నారు. రోజాలాంటి వారి స్పందనపై మౌనంగా ఉండటమే మేలు బురద లో రాయి వేస్తే మన మీదే పడుతుంది అన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేతలులో నేతలతో బాలకృష్ణ భేటీ అయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు వస్తాయని ఓట్ల కోసమే ఇక్కడ కొందరు తన తండ్రి ఎన్టీఆర్ జపం చేస్తున్నారని బాలకృష్ణ అన్నారు. ఇంతకాలం తెలంగాణలో టీడీపీ అజ్ఞాతంలో ఉంది. ఇప్పుడు మళ్లీ చైతన్యంలోకి వచ్చింది. తెలంగాణలో అంతా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పోరాడాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు టైమ్ వచ్చింది తప్పకుండా టీడీపీ జెండా రెపరెపలాడుతుంది. పొత్తులపై చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు(Director Rajamouli).
స్కిల్ల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని పలు రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. మరో బాలకృష్ణ అయితే బహిరంగంగానే మైక్ పట్టుకుని మరీ విమర్శించారు. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా రంగంలోకి దిగారు దర్శకుడు రాజమౌళి. తెలంగాణ తెలుగు సినిమారంగంలో తనకంటూ సొంత ఇమేజ్తో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ గొడవల్లో లాగొద్దని రిక్వెస్ట్ చేసారు.(Director Rajamouli)
అంతేకాదు జూనియర్ మనసులో ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీ లేదని, అతను ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ చేస్తున్నట్లు స్పష్టం చేశాడు. ఇదే విషయంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని తనతో చెప్పారని, ఇలాంటి సమయంలో లేనిపోని స్టేట్మెంట్ ఎందుకని రాజమౌళి తన సన్నిహితుల దగ్గర వాపోయారట. ఇదే సమయంలో రాజమౌళి స్పందనపై నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు.
క్షణం మరియు కృష్ణ, అతని లీల చిత్రాలకు ప్రసిద్ధి చెందిన రవికాంత్ పారెపు ఈ ఉత్తేజకరమైన ప్రాజెక్ట్ కోసం దర్శకుని సీటును తీసుకున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, ఎస్ఎస్ రాజమౌళి రేపు సాయంత్రం 5:00 గంటలకు సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ను విడుదల చేయనున్నారు.