Samantha : సమంత పుట్టడమే దండగ.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..
ఎలాంటి ముందస్తు అనుభవం లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సమంత ఐదు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటూ త్వరగానే గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమె జీవితంలో ఇబ్బందులు తప్పడం లేదు. సమంత జీవితం ఇంత అనూహ్యంగా మారడానికి ప్రధాన కారణం ఆమె సరైన జ్యోతిష్య లెక్కలు పాటించకపోవడమేనని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. ఒకవేళ సమంత జోతిష్యం ఫాలో అయ్యి ఉంటె తన జీవితం ఇంకోలా ఉండేది అన్నారు వేణు స్వామి. మరి సమంత జీవితం ఇలా ఉండడానికి అసలు కారణం ఏంటో తెలుసుకుందాం.
సమంత జీవితం కష్టాల్లో పడటానికి ప్రధాన కారణం ఆమె అమావాస్య రోజున పుట్టడమే. చాలా మంది ఆడపిల్లలు ఈ రోజున పుడతారు మరియు లాభాలు మరియు నష్టాలు రెండూ ఉంటాయి. అయితే అమావాస్య నాడు పుట్టిన అమ్మాయిలకు లాభాల కంటే నష్టాలే ఎక్కువ. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమావాస్య రోజున పుట్టడం వల్లే సమంత జీవితం మారిపోయింది అని చెప్పారు. నివారణ చర్యలు చేపట్టి పూజలు, హోమాలు చేస్తే ఆమె జీవితం బాగుంటుందన్నారు. అయితే నాగ చైతన్యతో పెళ్లికి ముందు కొంత మంది ముఖ్యంగా వేణు స్వామి తమ పెళ్లి చాలా రోజులు ఉండదని,
త్వరలోనే విడిపోతారని అన్నారు. కానీ అతని మాటలు పట్టించుకోకుండా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నారు సమంత నాగచైతన్య. అదనంగా, ఆమె సినిమా కెరీర్ చాలా బాగానే ఉన్నప్పటికీ, ఆమె ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దానికి తోడు సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఇటీవల, నటి సమంత అక్కినేని చర్మ సమస్యలు మరియు మైయోసైటిస్తో బాధపడుతున్నట్లు చాలా వార్తలు వచ్చాయి. అయితే వీటన్నింటికీ కారణం సమంత ఒక అమావాస్య రోజున పుట్టడమే అని అంటున్నారు.
అమావాస్య రోజు పుట్టడం సమంతకు శాపంగా మారిందని ఓ ఇంటర్వ్యూలో జ్యోతిష్యుడు వేణు స్వామి అన్నారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి, ఈ పరిస్థితిని తెలుసుకున్న సమంత అభిమానులు ఇప్పటికైనా వేణు స్వామి పరిహార పూజలు చేసే విషయంలో ఏం చెబితే అదే చేయాలని కోరుకుంటున్నారు.