Kalyan Ram : తారక రత్న ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్..
Tarak Ratna Health : 2023 జనవరి 27న టీడీపీ అధినేత నారా లోకేష్ పాదయాత్రలో నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చింది. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తారక్ రత్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందొ తెలుసుకోవటానికి నందమూరి అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తమ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి నిన్న జరిగిన అమిగోస్ ప్రెస్ మీట్ లో కళ్యాణ్రామ్ను ఒక పాత్రికేయుడు అడగగా, కళ్యాణ్ రామ్ ఇలా సమాధానం ఇచ్చాడు.
“డాక్టర్లు ఆయన్ని బాగా చూసుకుంటున్నారు, అతి త్వరలో వాలే మీకు సరైన జవాబు చెప్తారని తెలిపాడు (Tarak Ratna Health). గత వారం నుంచి తారక రత్న ఆరోగ్యం గురించి ఆసుపత్రి యాజమాన్యం ఒక అప్డేట్ను కూడా ప్రజలతో పంచుకోలేదు. తారకరత్న నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్ మనవడు. నందమూరి కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కళ్యాణ్ రామ్ని తన కజిన్ తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. తారకరత్న జనవరి 27, 2023న గుండెపోటుకు గురయ్యారు. కళ్యాణ్ రామ్ తన హెల్త్ అప్డేట్ను పంచుకున్నారు “అతను ఇంకా కోలుకుంటున్నాడు,
అతను ఉత్తమ చికిత్స పొందుతున్నాడు మరియు ఉత్తమ వైద్యులు అతనితో ఉన్నారు. వైద్యులు మాత్రమే తారక్ రత్న యొక్క ఖచ్చితమైన ఆరోగ్య అప్డేట్ చెప్పగలరు. అతని కోసం మీ అందరి ప్రార్థనలు అవసరం అని తెలియచేసారు”. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్రామ్, మంచు మనోజ్ తారకరత్నను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కళ్యాణ్ రామ్ యొక్క అమిగోస్ ఈ రోజు తెరపైకి వచ్చింది మరియు యూనిట్ మొత్తం ఈ ప్రాజెక్ట్పై అధిక అంచనాలు పెట్టుకుంది, ముఖ్యంగా బింబిసార బ్లాక్ బస్టర్ విజయం తర్వాత.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రూపొందిన అమిగోస్ చిత్రానికి నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. తొలి షోలు మరియు ఓవర్సీస్ ప్రీమియర్ల నుండి ఈ చిత్రం యొక్క ప్రారంభ స్పందనల విషయానికి వస్తే, చిత్రానికి రక రకాలా రివ్యూస్ వస్తున్నాయి. చాలా మంది ప్రేక్షకులు కథ మరియు కథనం బాగుందని భావించారు, కానీ దర్శకుడు స్క్రీన్ ప్లేలో ఇంకా మెరుగ్గా చేయొచ్చు అని తెలిపారు.
ఈ చిత్రం ఇప్పటికే ఎక్కువ బజ్ కలిగి ఉంది, ఇప్పుడు ఈ పలు రకాల నివేదికలు,టాక్ ఖచ్చితంగా సినిమాపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. తెలుగు రాష్ట్రాల మొత్తం వ్యాపారం విలువ 13 కోట్లు మరియు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 15 కోట్ల వరకు ఉంటుంది.