Cinema

Chiranjeevi : చిరంజీవి రజినీకాంత్ కాంబోలో మిస్ అయిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా..?

Chiranjeevi Rajinikanth : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వివాదాలతో సతమతమవుతున్న వర్మ ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ గతిని మార్చాడు. అక్కినేని నాగార్జున నటించిన శివ పాతికేళ్ల తరువాత కూడా ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. యాక్షన్‌, స్క్రీన్‌ప్లే, టేకింగ్‌, మేకింగ్‌ ఇంతవరకు చూడని విధంగా శివ తో పరిచయమైంది. అప్పటి నుంచి ఆర్జీవీ పేరు మోతమోగిపోయింది. దీంతో పాటు బాలీవుడ్‌కి వెళ్లి రంగీలా, సత్య వంటి సూపర్ హిట్‌లు చేసి దేశం మొత్తం తనవైపు చూసేలా చేశాడు.

megastar-chiranjeevi-rajinikanth-combo-had-missed-a-bollywood-block-buster-movie

ప్రస్తుతం వర్మ సినిమాలు పేలవంగా ఉన్నాయి. ఆర్జీవీ తీసిన సినిమాలు ఒకప్పుడు క్లాసిక్ సినిమాల జాబితాలో నిలిచిపోయాయి. తెలుగులో శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో, హిందీలో రంగీలా సినిమాతో వర్మకు ఆ రేంజ్ గుర్తింపు వచ్చింది. రంగీలా సినిమా తెలుగులో తెరకెక్కిల్సిందట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, శ్రీదేవి కలిసి నటించనున్నారు. కానీ వారికి ఈ సినిమా రాలేదు. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత అశ్వనీదత్ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. శివ హిట్ తర్వాత రామ్ గోపాల్ వర్మ నాతో సినిమా చేయడానికి అడ్వాన్స్ ఇచ్చారు(Chiranjeevi Rajinikanth).

Ram Gopal Vamra

అప్పుడే రంగీలా, గోవిందా గోవిందా సినిమాల గురించి వర్మ నాకు కథలు చెప్పాడు. రంగీలా మూవీని చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవిలతో కలిసి తీస్తే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నాడట వర్మ. కానీ నాకు గోవిందా గోవిందా మూవీ కథ నచ్చింది. వేంకటేశ్వరుడి హుండీ చుట్టూ ఆ కథ తిరుగుతుంది. అందుకే నేను ఆ సినిమాను ఓకే చేసి నాగార్జునతో తీశాను. రంగీలా సినిమాలో కథ మొత్తం శ్రీదేవి చుట్టూ ఉంటుంది. చిరంజీవి, రజినీ పాత్రలు అంత ఇంపాక్ట్ చూపించవు అని అనుకున్నాను. అందుకే నేను ఆ సినిమా తీయలేదని అశ్వనిదత్ తెలిపారు(Chiranjeevi Rajinikanth).

Sridevi

చివరకు రంగీలా సినిమాను వర్మ బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్, అమిర్ ఖాన్, ఊర్మిళతో తీశాడు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. బాలీవుడ్ ని మొత్తం షేక్ చేసింది రంగీలా. కానీ గోవిందా గోవిందా ఇక్కడ ప్లాఫ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌గా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తమన్నా భాటియా కథానాయికగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మెగా చిత్రం 2023 ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ రోజు, చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా భోలా శంకర్ షూటింగ్ మొత్తం మొత్తం పూర్తయిందని ప్రకటించారు.

సినిమా కోసం కష్టపడిన నటీనటులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే మ్యూజికల్ అప్‌డేట్‌లను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ద్వారా భోలా శంకర్ షూటింగ్ మొత్తం పూర్తయిందని ప్రకటించారు.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University