Gopichand : గోపీచంద్ ప్రభాస్ కంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ.. ఏదంటే..?
Gopichand Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తొలిసారిగా ‘వర్షం’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 2004లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో ప్రభాస్ హీరోగా నటించగా, గోపీచంద్ విలన్గా నటించాడు. ఈ సినిమాతో వీరి మధ్య ఏర్పడిన పరిచయం.. కొద్ది రోజుల్లోనే స్నేహంగా మారింది. అనతికాలంలోనే ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న టాక్ షో “అన్స్టాపబుల్` సీజన్ 2లో కూడా వీరిద్దరూ పాల్గొన్నారు.
ఒకరికొకరు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ గురించిన చాలా రహస్యాలను గోపీచంద్ లీక్ చేసాడు. అయితే ఈ బెస్ట్ ఫ్రెండ్స్ రీయూనియన్ తో మల్టీ స్టార్ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఆ తరుణం ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభాస్ చేతి నిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. మరోవైపు గోపీచంద్ కూడా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వీరి కలయికలో మల్టీస్టారర్ రావడం అంటే అంత సులభం ఏమీ కాదు.(Gopichand Prabhas)
అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. గతంలో ప్రభాస్-గోపీచంద్ కాంబోలో ఓ క్రేజీ మల్టీస్టారర్ మిస్ అయింది. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన `షోలే` సినిమాను గోపీచంద్. ప్రభాస్ ను హీరోలు గా పెట్టి రీమేక్ చేయాలని డాషింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ భావించాడు. వర్షం వంటి బ్లాక్ బస్టర్ అనంతరం షోలే రీమేక్ పై ఎన్నో వార్తలు వచ్చాయి. ప్రభాస్, గోపీచంద్ సైతం షోలే రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరిగింది. అయితే ఏవో కారణాల వల్ల ప్రభాస్, గోపీచంద్ కాంబో మల్టీస్టారర్ పట్టాలెక్కక ముందే ఆగిపోయింది.(Gopichand Prabhas)
అప్పట్లో ఈ విషయం ఇరువురి హీరోల అభిమానులను ఎంతగానో బాధపెట్టింది. గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఆభిమానులు నిరాశపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తను నటించిన గత చిత్రాలన్నీ కూడా ఫ్లాపులు ఎదురయ్యాయి.అయితే ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ టీజర్ రానే వచ్చేసింది. కే జి ఎఫ్-1,2 తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ప్రభాస్ కనిపించిన మాస్ లుక్ ను మించి ఈ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం