Cinema

Jyothi Rana: పోకిరి సినిమా లో ఉన్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..? గుర్తు పట్టడం కష్టమే..

Jyothi Rana తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “పోకిరి” చిత్రం అప్పట్లో బాక్స్ ఆఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పలు రికార్డులను కూడా నెలకొల్పింది. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. కాగా షియాజీ షిండే, సుబ్బరాజు, నాజర్, ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. అయితే ఈ చిత్రంలో లేడీ విలన్ పాత్రలో నటించిన “జ్యోతి రానా” ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.

అంతేగాక ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ప్రకాష్ రాజ్ “గిల్లితే తట్టుకోవాలి అరవ కూడదు” అంటూ జ్యోతి రానాతో చెప్పే డైలాగులు ప్రేక్షకులకు ఇప్పటికీ బాగానే గుర్తు ఉంటాయి. అలాగే తెలుగులో పోకిరి చిత్రంలో నటించిన తర్వాత దేవుడు చేసిన మనుషులు, హోమం, తదితర చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.కాగా ప్రస్తుతం జ్యోతి రానా ఒక పక్క సినిమాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూనే మరోపక్క మోడలింగ్ రంగంలో కూడా బాగానే రాణిస్తోంది.
తాజాగా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. `గ్రంథాలయం` చిత్రంలో నటించింది.(Jyothi Rana)

ఆమెతోపాటు విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియా చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. కంటెంట్ వున్న సినిమాల్ని ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారు..
అది చిన్న సినిమానా.? పెద్ద సినిమానా.? అన్న తేడాలుండవ్ ప్రేక్షకులకి. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా ఒక సస్పెన్స్ కాన్సెప్టు ను కమర్షియల్ గా ఫస్ట్ టైం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న సినిమానే “గ్రంధాలయం”.(Jyothi Rana)

విన్ను మద్దిపాటి, స్మిరితరాణిబోర, కాలికేయ ప్రభాకర్‌, కాశీవిశ్వనాథ్‌, డా.భద్రం, సోనియా చౌదరి నటీనటులు. సాయిశివన్‌ జంపాన దర్శకత్వంలో వైష్ణవి శ్రీ క్రియేషన్స్‌ పతాకం పై నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని శుక్రవారం(మార్చి 3న) గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలైన “గ్రంధాలయం” సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం .

అయితే జ్యోతి రానా బాలీవుడ్లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బాగానే రాణిస్తోంది. అయితే బాలీవుడ్లో ఈ అమ్మడు నటించిన “కరర్ ది డీల్” అనే చిత్రం ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది. ఇటీవలే కాబెరేట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో జ్యోతి రానా నటించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఖాళీగా ఉంటోంది.

Damon

Iam Praneeth Naidu, Iam passionate about writing entertainment articles on Movie News & Gossips.