Prabhas : ఏ మాత్రం తగ్గని ప్రభాస్ క్రేజ్ ఇంత కంటే రుజువు ఎం కావాలి..?
Prabhas craze : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాజమౌళి దర్శకత్వం లో బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఆయన ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలన్నింటిని తెరకెక్కిస్తూ తన క్రేజ్ పెంచుకుంటున్నాడు. గత రెండేళ్ల నుంచి ఆయన చేసిన ప్రతి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ కలెక్షన్ల పరంగా తన రేంజ్ ని మెయింటైన్ చేసిందనే చెప్పాలి. కాకపోతే ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. డిజాస్టర్ స్టోరీతో వచ్చినా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అవుతాయని చెప్పొచ్చు.
కాగా, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ చిత్రం రామాయణ ఇతిహాస కథాంశంతో రూపొందింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతే కాదు ఇందులో కొన్ని పాత్రలు రామాయణం కు విరుద్ధంగా ఉన్నాయన్న కామెంట్లు అయ్యాయి. ఇకపోతే ప్రభాస్ మొదటిసారి రాముడి గెటప్ లో నటించిన సినిమా కావడం వల్ల సినిమాపై అంచనాలు భారీగా పెట్టుకున్నారు(Prabhas craze).
అభిమానులు కానీ ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని ఎవరు ఊహించలేదు. కానీ ప్రభాస్ రేంజ్ను మాత్రం ఈ సినిమా ఎక్కడ తగ్గించలేదని చెప్పాలి. పూర్తిస్థాయిలో నెగెటివిటీ స్ప్రెడ్ అయినా సరే కలెక్షన్ పరంగా దూసుకుపోతోంది. మొదటివారం రూ.370 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో వారం కూడా లెక్కలన్నీ తలకిందులు చేస్తూ ఫైనల్ రన్ ముగిసేసరికి రూ .400 కోట్ల మార్కు క్రాస్ చేసి రికార్డు సృష్టించింది. టి సిరీస్ మరియు రెట్రో ఫైల్స్ సంయుక్తంగా చిత్రాన్ని రూ. 500 కోట్లు వసూలు చేసిన సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్తో ఆశ్చర్యపరిచింది.(Prabhas craze)
ఆడియో రైట్స్, ఇతర రైట్స్ ద్వారా మరిన్ని లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి సినిమా డిజాస్టర్ అయినా కూడా ఈ సినిమా కలెక్షన్లు ప్రభాస్ క్రేజ్ ఏంటో రుజువు చేశాయనే చెప్పాలి. ఆదిపురుష్ పరాజయం తర్వాత, రాబోయే చిత్రాలలో బలమైన లైనప్ ప్రభాస్తో సహా నటీనటులందరూ తమ తదుపరి ప్రాజెక్ట్లకు వెళ్లారు.
డార్లింగ్ స్టార్ తర్వాత సాలార్ మరియు ప్రాజెక్ట్ కెలో కనిపించనున్నారు, వీటిలో రెండోది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా చెప్పబడుతుంది. బజ్ పెరుగుతూనే ఉంది, సీనియర్ దర్శకుడు తమ్మారెడ్డి ఈ చిత్రం బాక్సాఫీస్ సంభావ్యత సంచలనాత్మక వినిపించారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ప్రాజెక్ట్ K లో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే మరియు దిశా పటానీ వంటి బలమైన తారాగణం ఉంది. తాజాగా, లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కూడా ఈ తారాగణంలో చేరారు. ఈ చిత్రం భారతీయ సినిమాలో ముందుగా ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదు