Project K Remuneration : అత్యంత పారితోషకం అందుకున్న ప్రాజెక్ట్ కే నటీనటులు.. ఎంతో తెలిస్తే దిమ్మ తిరుగుంది ..
Project K Remuneration : ప్రముఖ పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ప్రాజెక్ట్ కె. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె మరియు దిశా పఠానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భారీ తారాగణం ఉండటం గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమా నుంచి గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆత్రుతను పెంచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ సినిమాను పాన్ వరల్డ్ మూవీగా తీసుకు వస్తున్నట్లు వెల్లడించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవలే ఈ సినిమాలో లోకనాయకుడు కమలహాసన్ కూడా నటిస్తున్నారు అంటూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో అంచనాలు కూడా ఎక్కువ అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారట. ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ నుంచి మొదలు పెట్టి కీలక పాత్రల వరకు పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం(Project K Remuneration).
ఇప్పుడు ఎవరికి జీతం ఇస్తున్నారో చూద్దాం. ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ రూ.150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. విశ్వనాయకుడు కమల హాసన్ రూ. 50 కోట్లు, అమితాబ్ బచ్చన్ రూ. 15 కోట్లు, దీపికా పదుకొణె రూ. హీరోయిన్ గా 10 కోట్లు. ఈ సినిమా కోసం దిశా పఠానీ 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో నటించగా.(Project K Remuneration)
ఈ సినిమా కూడా డిజాస్టర్ టాక్ వైపు దూసుకు వెళ్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా బిజీగా ఉన్న ఆయన ఆది పురుష్ సినిమాతో మాత్రం సక్సెస్ ను పొందలేకపోయారు. ఇకపోతే ఈ సినిమా మొదటి రోజే 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కానీ ఫుల్ రన్ ముగిసే సరికి డిజాస్టర్ గా మిగిలిందని చెప్పాలి.
ప్రభాస్ ఆది పురుష్ ఈవెంట్ కి దూరంగా ఉండడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ప్రభాస్ ఆది పురుష్ సినిమాను చూశారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.