Rashmi Gautham: రెండో పెళ్లి వాడితో సీక్రెట్గా యాంకర్ రష్మీ పెళ్లి ?
Anchor Rashmi Gautham:జబర్దస్త్ యాంకర్గా బుల్లితెర ఆడియన్స్కి సుపరిచితమైన యాంకర్ రష్మీ.. వీలు కుదిరినప్పుడల్లా వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. జబర్దస్త్తో పాటు ఢీ, పండగ పండగకు స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ పర్సనల్ మ్యాటర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో రష్మీ- సుడిగాలి సుధీర్ లవ్ ట్రాక్ గురించి ఎన్నో వార్తలు షికారు చేయగా ఇప్పుడు ఏకంగా రష్మీ పెళ్లి మ్యాటర్ బయటకొచ్చింది.
అలాంటి రష్మీ జబర్దస్త్ లో స్టార్ యాంకర్ గా మారాక సినిమాల్లో కూడా హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ఇక బుల్లితెర మీద రష్మీ సుధీర్ ల జోడీకి మంచి గుర్తింపు ఉంది. వెండితెరపై అనుష్క ప్రభాస్ ల జంటకు ఎంత మంచి గుర్తింపు ఉందో బుల్లితెరపై రష్మీ సుధీర్ ల జోడికి అంతే గుర్తింపు ఉంది.అంతేకాదు చాలామంది వీరి అభిమానులు వీరిద్దరి పెళ్లి జరిగితే బాగుండు అని కోరుకుంటారు. ఇదిలా ఉంటే ఇప్పటికే మల్లెమాల నిర్వహించిన చాలా ప్రోగ్రామ్స్ లో సుధీర్ రష్మీ ల పెళ్లి జరిగింది.
ఇక తాజాగా రష్మీ గురించి ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అదేంటంటే రష్మీ రెండో పెళ్లి వాడిని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఇది నిజంగా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ చేశారు.ఇందులో రష్మీ పెళ్లికూతురుగా కనిపించింది. ఇక ఈ ప్రోమోలో రష్మీ స్వయంవరం ఏర్పాటు చేశారుఈ స్వయంవరానికి చాలామంది బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు.(Anchor Rashmi Gautham)
గతంలో కూడా ఇలాగే రష్మీ విషయంలో ఎన్నో రూమర్స్ షికారు చేశాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్కి రష్మీకి ముడిపెడుతూ వచ్చిన వార్తలు లెక్కల్లో చెప్పలేం. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని తెగ చెప్పుకున్నారు జనం. కానీ, చివరకు తమ మధ్య ఏమీ లేదని తేల్చేసింది రష్మీ. కేవలం కెమెరా ముందే అలా ఉంటాం తప్ప తమ మధ్య ఇంకేదీ లేదని ఆమె కన్ఫర్మ్ చేసింది.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొంతమంది నెటిజన్స్ మాత్రం రష్మీ నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.కానీ అసలు విషయం తెలిసాక షోకోసం ఇలా చేశారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.