Trivikram : త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న మరో బ్లాక్ బస్టర్.. ఫాన్స్ కి పండగే..
Trivikram Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని నమోదు చేయడంతో, రెండవ భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే తాజాగా ఓ వైరల్ న్యూస్ అల్లు అర్జున్ అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.
ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ మళ్లీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురం వంటి చిత్రాలు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ నాలుగోసారి కలిసి పని చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈరోజు సాయంత్రం కల్లా ఈ కాంబో పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో భీమ్లా నాయక్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంయుక్త మీనన్(Trivikram Allu Arjun).
హీరోయిన్గా నటించబోతుందని ఇప్పటికే ఈమె వరుసగా పలు విజయవంతమైన సినిమాలలో నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అందుకే ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే విరూపాక్ష సినిమాతో కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ ఊహాగానాలే నిజం అయ్యాయి. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమాపై అనౌన్స్మెంట్ వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మితం కానుంది. అది కూడా పాన్ ఇండియన్ లెవల్ లో నిర్మించబోతున్నారు. ఈ మేరకు చిత్రటీమ్ ఒక చిన్న వీడియోను వదిలారు.
ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబులతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ తో సినిమా ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగతో సినిమా చేయనున్నట్టు సమాచారం.ఇక పుష్ప2 విషయానికి వస్తే.. ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా ఇతర పాత్రల్లో సునీల్.(Trivikram Allu Arjun)
రావు రమేష్, ధనుంజయ, యాంకర్ అనసూయ నటిస్తున్నారు మరో విషయం ఏమంటే. పుష్ప సిరీస్లో మూడో పార్ట్ కూడా రానుందని తెలుస్తోంది. పుష్ప 2లో పుష్పరాజ్ రూలింగ్ చూపిస్తూ భారీ ట్విస్ట్తో ముగిస్తారట. ఇక పుష్ప 3తో సిరీస్ను ముగిస్తారని తెలుస్తోంది.దీనికి సంబంధించిన కథ ఇప్పటికే రెడీ అయ్యిందట. ఈ మూడో పార్ట్.. 2025లో కానుందని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా సినిమా తర్వాత ఈ పుష్ప 3 ఉండనుందట.