Devara : ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందా..? నక్కను చూసి వాత పెట్టుకున్న దేవర..
Jr Ntr Devara : తాజాగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని రాజమౌళి నిర్ణయించారు కానీ మొదట ఒకే సినిమాగా తీయాలనుకున్నారు. “బాహుబలి” రెండు పార్టులు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ప్రశాంత్ నీల్ కన్నడలో హీరో యాష్ నటించిన ‘కెజిఎఫ్’ చిత్రాన్ని చాప్టర్ 1, 2 పేరుతో రెండు భాగాలుగా విడుదల చేశారు. ఆ తర్వాత సుకుమార్ అల్లు అర్జున్తో కలిసి పుష్ప చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
ఆ సినిమా మేకింగ్ సమయంలో మేల్ లీడ్ పాత్ర స్టోరీ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో డెవలప్ కావడంతో మధ్యలో ఓ ట్విస్ట్ చేసి రెండు భాగాలుగా తయారు చేశారు. అలా పుష్ప మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. రెండో భాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర కూడా అదే బాటలో వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ తారక్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతోంది. సెట్స్పై ఉన్న ఈ సినిమా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది(Ntr Devara).
అందుకే దేవర సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని విడుదల వరకు గోప్యంగా ఉంచాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. స్టార్ సినిమాల ప్రతి చిన్న అప్డేట్ ఎలాగూ లీక్ అవుతుంది. ఇటీవలే దేవర కూడా బాహుబలి కేజీఎఫ్ పుష్పాన్ని రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, ఇది కొంతమంది అభిమానులను ఆనందపరుస్తుంది. కథ డిమాండ్ మేరకు ఇలా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ రెండు భాగాలుగా చేయడం మంచి పనికాదని, నక్కను చూసి వాతపెట్టుకోవడమే అని ట్రోల్స్ చేస్తున్నారు.(Ntr Devara)
దేవర సినిమాను కొరటాల శివ చాలా ప్రెస్టీజియస్ గా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం తన సర్వస్వం ఇస్తున్నాడు. రామ్ చరణ్ తో నటించిన ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ కూడా ఈ సినిమా ద్వారా తన స్టామినాను మరోసారి నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు భాగాలుగా సినిమాను విడదీయడం అనేది వీరికి కలిసొస్తుందా అనేది చూడాలి.
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తీసుకున్న వీడియోలో అతను తన ఆత్మహత్యకు గల కారణాలని వెల్లడించాడు. అయితే ఈ ఆత్మహత్య వెనుక వైసీపీ ఉందనే ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తెరపైకి తెస్తున్నాయి.
ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. నేరుగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.