CinemaTrending

Allu Arjun: నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మామ..

Allu Arjun National Award: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈనా ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పుష్ప సినిమాలో తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్నటువంటి అల్లు అర్జున్ ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ సినిమాలోని తన నటనకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు తెలుగులో ఏ హీరో కూడా ఇలాంటి అవార్డ్ అందుకోలేదు.

allu-arjun-uncle-gave-a-wonderful-gift-after-receiving-the-national-award-for-pushpa-movie

ఇలా జాతీయ అవార్డ్ అందుకున్నటువంటి తొలి హీరోగా అల్లు అర్జున్ గుర్తింపు పొందారు. ఈ వేడుక గత రెండు రోజుల క్రితం ఢిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అల్లు అర్జున్ అందుకున్న సంగతి మనకి తెలిసిందే. ఇలా నేషనల్ అవార్డ్ అందుకున్న అనంతరం సోషల్ అయిన హైదరాబాద్కి రావడంతో అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక తన అల్లుడు కెరియర్ పరంగా మరో మెట్టు పైకి ఎక్కడంతో అల్లు స్నేహారెడ్డి సొంత తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా తన అల్లుడికి పార్టీ ఇచ్చారు(Allu Arjun National Award).

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు పుష్ప సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది సెలబ్రిటీలను ఆహ్వానించి వారందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వేడుకకి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో భాగంగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు డైరెక్టర్ సుకుమార్ కూడా సందడి చేశారు. ఇక అల్లు అరవింద్‌తో ఆయన ముగ్గురు కుమారులు దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.(Allu Arjun National Award)

ఇక ఈ ఫొటోలు చూసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్పా సినిమాకు నేషనల్ అవార్డ్ రావడంతో పుష్పా సీక్రెట్ చిత్రంపై మరింత బాధ్యతలు పెరిగాయనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు 15 వ తేదీకి విడుదల సిద్ధం చేస్తున్నారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక 2023 అక్టోబర్ 17న జరిగింది. విజేతలు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

పుష్ప ది రైజ్ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఇదిలా ఉంటే, బ్లాక్ బస్టర్ చిత్రంలో తన నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నిలిచాడు. నిన్న రాత్రి అంటే అక్టోబర్ 21న మైత్రీ మూవీ మేకర్స్ జాతీయ అవార్డు గ్రహీతలకు పార్టీని ఏర్పాటు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ జాతీయ అవార్డు గ్రహీతలకు పార్టీని ఏర్పాటు చేసింది.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University