Cinema

Director Kirsh : పెళ్ళైన ఏడాదికే విడాకులు తీసుకున్న క్రిష్.. కారణం ఆ హీరోయిన్ ఏనా..

Director Krish : దర్శకుడు క్రిష్ అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన దర్శకుల్లో క్రిష్ ఒకరు. గగమం సినిమాతో దర్శకత్వ రంగ ప్రవేశం చేసిన క్రిష్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అల్లుఅర్జున్ నటించిన వేదం,రానా దగ్గుబాటి నటించిన కృష్ణం వందే జగద్గురుం, బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి, కంచె వంటి డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో దర్శకుడిగా పనిచేశాడు.

because-of-that-heroin-that-director-krish-got-divorced-within-a-year-of-marriage

అయితే దర్శకుడు క్రిష్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. గుంటూరులో పుట్టి పెరిగిన క్రిష్ అమెరికాలో ఎంఎస్ చేశారు. ఆగస్ట్ 7, 2016న డాక్టర్ రమ్య వెలగ అనే అమ్మాయిని క్రిష్ పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. టాలీవుడ్ మొత్తం క్రిష్ పెళ్లి సందడి నెలకొంది. క్రిష్, రమ్యల పెళ్లి పెద్దలు కుదిరింది. రమ్య కూడా చాలా అందంగా ఉంది. కానీ వారి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. పెళ్లయిన ఏడాదికే క్రిష్ నుంచి రమ్య విడాకులు తీసుకుంది(Director Krish).

Director Krish

అయితే క్రిష్ కాపురంలో ఓ హీరోయిన్ సందడి చేసిందనే టాక్ వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహించిన సినిమా ద్వారా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ హీరోయిన్ తో క్రిష్ బాగా క్లోజ్ అయ్యాడు. పెళ్లయిన తర్వాత కూడా ఆమెతో సంబంధాన్ని కొనసాగించాడు. షూటింగుల పేరుతో ఇంట్లో కంటే బయటే ఎక్కువ సమయం గడిపేవాడు. అయితే భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌పై ర‌మ్య‌కు అనుమానాలు స్టార్ట్ అయ్యాడ‌ట‌. దాంతో ఒక రోజు తెగించి క్రిష్ ముంబైలో ఉన్నాడ‌ని తెలుసుకుని అక్క‌డ‌కు వెళ్లింద‌ట‌. ఇక ఆ టైమ్ లోనే క్రిష్ స‌ద‌రు హీరోయిన్ తో రూమ్‌లో భార్య‌కు అడ్డంగా దొరికిపోయాడ‌ట‌. ఇంకేముంది ర‌మ్య విడాకులకు అప్లై చేసింది. 2018లో క్రిష్, రమ్యలకు కోర్టు విడాకులు మంజూరు చేసింది.(Director Krish)

Krish

ఇక విడాకుల త‌ర్వాత క్రిష్ అంత సాఫీగా ఏమీ సాగ‌టం లేదు. ర‌మ్య దూరం అయ్యాక క్రిష్ బాల‌య్య మ‌హానాయ‌కుడు, క‌థానాయ‌కుడు చేశాడు. వైష్ణ‌వ్ తేజ్‌తో కొండ‌పొలం తీశాడు. ఈ మూడు సినిమాలో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఇక మూడేళ్ల క్రితం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`ను ప్రారంభించాడు. ఈ మూవీ వెన‌క్కే గానీ ముందుకు సాగ‌టం లేదు.

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీర మల్లు. అయితే చాలా కాలం పాటు షూటింగ్ ఆగిపోవడంతో సినిమా ఒక్కటి కూడా ముందుకు సాగడం లేదు.

ఈలోగా, పవన్ కళ్యాణ్ PKSDT ఫిల్మ్, OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ఇతర ప్రాజెక్ట్‌లపై ఎక్కువ దృష్టి పెట్టారు. ముంబైలో ఓజీ రెండో షెడ్యూల్‌ను ప్రారంభించినట్లు తాజా సమాచారం.

Yashwanth Chimmu

Iam Yashwanth Chimmu, iam a writer who has made a name for myself in the literary world. Born in Hyderabad i discovered my passion for writing at a young age and has been pursuing it ever since. I obtained My Bachelor's degree in Sriram College and completed my masters from Gurunanank University