Srinu Vaitla: ఆ స్టార్ హీరోతో మళ్ళీ ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీనువైట్ల..
Srinu Vaitla: కామెడీ చిత్రాలతో బ్లాక్బస్టర్స్ను తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్లో కొత్త ట్రెండ్ను సృష్టించాడు దర్శకుడు శ్రీను వైట్ల. గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో రేసులో వెనుకంజలో ఉన్న ఆయన ఎట్టకేలకు తన తదుపరి చిత్రానికి హీరో దొరికాడని, నాలుగేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు మాకో స్టార్ గోపీచంద్ అని అంటున్నారు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. తనకిష్టమైన హాస్య జానర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.
దర్శకుడు శ్రీను వైట్ల ఒకప్పుడు వరుస విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆనందం, ఢీ, దుబాయ్ శీను, రెడీ, దూకుడు వంటి చిత్రాలతో దర్శకుల్లో ట్రెండ్సెట్టర్గా పేరు తెచ్చుకున్నారు. ఆగడుతో శ్రీను వైట్ల బ్యాడ్ టైమ్ మొదలైంది. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోనీ సినిమాలు చేశాడు. ఈ పరాజయాలతో దాదాపు నాలుగేళ్ల పాటు సినిమాలకు విరామం ఇచ్చాడు. ఇంతకుముందు బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఢీకి సీక్వెల్ గా మంచు విష్ణుతో ఢీ అనౌన్స్ చేసినా, ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ఆగిపోయింది(Srinu Vaitla).
ఢీ సీక్వెల్ను పక్కనపెట్టిన శ్రీను వైట్ల ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్ కథాంశంతో మరో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం. గోపీ మోహన్ ఈ చిత్రానికి కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే గోపీచంద్ని కలిసిన శ్రీను వైట్ల కథలోని మెయిన్లైన్ని చెప్పినట్లు సమాచారం. అది హీరో గోపీచంద్కి కూడా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫైనల్ వెర్షన్ స్క్రిప్ట్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాబట్టి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.(Srinu Vaitla)
యాక్షన్ హీరో గోపీచంద్ తదుపరి ప్రాజెక్ట్ భీమా అని మేము ఇంతకుముందు నివేదించాము. ప్రముఖ కన్నడ నిర్మాత ఎ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ డ్యూటీ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తాజా అప్డేట్ల ప్రకారం, భీమా బృందం యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ను ముగించింది. గత కొన్ని రోజులుగా కాకినాడ సమీపంలోని రాజానగరం మరియు అద్దరిపేట బీచ్లలో గోపీచంద.,
భీమా యూనిట్తో కలిసి తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ సమయంలో గోపీచంద్ను చూసేందుకు వందలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. స్పష్టంగా, యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చింది మరియు అవుట్పుట్తో టీమ్ థ్రిల్గా ఉంది.