Rashmi: రష్మీని రాత్రికి రమ్మని పిలిచిన కమెడియన్.. అసలు ఏమైందంటే..?
Rashmi: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం లేని గ్లామరస్ యాంకరమ్మ రష్మీ గౌతమ్. బుల్లితెరపై అనేక షోలకు గ్లామర్ టచ్ ఇస్తూ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. టీవీ షోలు మాత్రమే కాకుండా సినిమాల్లో ఘాటు సన్నివేశాలతో అట్రాక్ట్ చేస్తున్న ఈ బ్యూటికి విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు ఫేమస్ షో జబర్దస్త్ అంటే తెలియనివాళ్ళు ఎవరు ఉండరు. ఇందులో ప్రసారం అయ్యే స్క్రిప్ట్ లను చూసి ప్రేక్షకులంతా పగలబడి నవ్వుతుంటారు. జబర్దస్త్ లో నటించిన యాక్టర్స్ కి చాలా మంచి క్రేజ్ ఉంటుంది. ముక్యంగా యాంకర్ రష్మీ.
సుడిగాలి సుధీర్ మధ్య బాండింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఇక వీరిద్దరూ ప్రేమ లో ఉన్నారని పెళ్ళి కూడా చేసుకుంటారని అప్పట్లో సోషల్ మిడిల్ కూడా పుకార్లువచ్చాయి. కానీ వీళ్ళు మాత్రం మా ఇద్దరి మధ్య ఏమి లేదంటూ గట్టిగ చెప్పేసారు. జబర్దస్త్లో సుధీర్ పెద్దగా కనిపించడం లేదు. కానీ అతని సహచరులు, స్నేహితులు ఆటో రామ్ ప్రసాద్ మరియు గెటప్ శ్రీను ఇప్పటికీ ఆ షోలో కొనసాగుతున్నారు. ఆటో రామ్ ప్రసాద్ అనే ఓ డైలాగ్ ఇప్పుడు సంచలనంగా మారింది. రష్మీపై ఆయన చేసిన వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన వస్తోంది(Rashmi).
ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ్ ప్రసాద్ అనే టాక్ నడుస్తోంది. జబర్దస్త్లో డైలాగ్స్ అలరిస్తాయి. ముఖ్యంగా కామెడీ స్కిట్లలో డబుల్ మీనింగ్ డైలాగ్లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిపై విమర్శలు పెరుగుతున్నాయి. కానీ పాపులర్ కామెడీ షో కావడంతో తెలుగులో ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతోంది. తాజాగా రామ్ ప్రసాద్ జబర్దస్త్ స్కిట్లో ఓ డైలాగ్ చెప్పాడు. రాత్రికి రమ్మని రష్మీకి ఫోన్ చేశాడు. ఆ మాటకు జడ్జి స్థానంలో ఉన్న ఇంద్రజ వెంటనే స్పందించింది.(Rashmi)
ఓయ్ హెచ్చరించారు. రామ్ ప్రసాద్ వెంటనే తలదాచుకున్నాడు. మా ఊరిలో రాత్రి జాతర ఉందని, అందుకు పిలుపునిచ్చానని పేర్కొన్నారు. ఇప్పటికి ఆ సంఘటన ముగిసినా ప్రేక్షకులు ఆ డైలాగ్ను మరిచిపోలేదు. రష్మీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. రామ్ప్రసాద్ డైలాగ్కి అందరూ ఫిదా అవుతున్నారు. అయితే అసలు ఏం జరిగిందో ప్రోమోలో మాత్రం క్లారిటీ లేదు.
ఇది పూర్తిగా ప్రసారం కాగానే దీనిపై స్పందించాలని రష్మీ అభిమానులు ఆలోచిస్తున్నారు. గతంలో కూడా ఈ షోకి సంబంధించి ఇలాంటి ప్రోమోలు కొన్ని విడుదలయ్యాయి. ఇది కూడా అలాంటిదే అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి.