Chaitanya Niharika : నిహారిక దెబ్బకు ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిన చైతన్య.. అందుకే అక్కడికి వెళ్ళాడా..?
chaitanya full depression : మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని.. విడాకులు కూడా తీసుకున్నారని గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నిహారిక, చైతన్య తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలు, ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలను తొలగించారు. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి చైతన్య దూరంగా ఉంటున్నాడు. తాజాగా జొన్నలగడ్డ చైతన్య నిహారిక విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుకలో కూడా చైతన్య జొన్నలగడ్డ కనిపించలేదు.
వారిద్దరూ 2020లో పెళ్లి చేసుకున్నారు.అయితే రెండేళ్లుగా సత్సంబంధాలతో ఉన్న ఈ జంట ఈ ఏడాది ప్రారంభం నుంచి విడివిడిగా జీవిస్తున్నట్లు సమాచారం. చైతన్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో నిహారిక ఫోటోలను తొలగించడంతో, అప్పటి నుండి వారి మధ్య దూరం పెరిగింది. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో కూడా చైతన్య జొన్నలగడ్డ కనిపించలేదు. దీంతో నిహారిక చైతన్య విడాకులు దాదాపు ఖాయమైనట్లే. అయితే భర్తతో విడిపోయాక నిహారిక నటనతో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటుంది(chaitanya full depression).
కానీ చైతన్య ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. ఈ క్రమంలోనే నిహారిక దెబ్బకు చైతన్య ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. అయితే దాదాపు నాలుగు నెలల తర్వాత చైతన్య ఓ పోస్ట్ పెట్టాడు. ముంబైలోని `గ్లోబల్ విపాసనా పగోడా` మెడిటేషన్ సెంటర్ లో ఉన్నానని తెలుపుతూ పలు ఫోటోలు పంచుకున్నాడు. `ఇక్కడికి నన్ను వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. గత 10 రోజులు గా నా లైఫ్ లోకి వచ్చిన ఈ విపాసపా యోగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియెన్స్.(chaitanya full depression)
ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది అలాంటిదే` అంటూ చైతన్య ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. మొత్తానికి నిహారికతో విడాకుల కారణంగా బాధలో ఉన్న చైతన్య.. ప్రశాంతత కోసం మెడిటేషన్ సెంటర్ కు వెళ్లాడని ఆయన పోస్ట్ తో స్పష్టంగా తేలిపోయింది. మరియు ఇది నా జీవితంలో ఒక మంచి అనుభవం.
ఒక్కోసారి అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు వెళ్లి ఎంతో అనుభవంతో తిరిగి వస్తుంటాం. ఇది కూడా అలాంటిదే.. అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకున్నాడు.
అయితే ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో.. నిహారిక కారణంగా తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన జొన్నలగడ్డ చైతన్య.. మెడిటేషన్ సెంటర్ కు వెళ్లి డిప్రెషన్ నుంచి బయటపడ్డాడని దీన్ని చూసిన పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.