Prabhas : ప్రభాస్ ఒక్క రాత్రి ఎంజాయ్ కోసం కోట్లు ఖర్చుచేసిన కృష్ణంరాజు.. ఎంతంటే..?
Prabhas Krishnam Raju : ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రభాస్ ఈ రేంజ్ లో ఉన్నారంటే నటనతో పాటు పెదనాన్న కృష్ణంరాజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కృష్ణంరాజు లేకపోతే ప్రభాస్ ఇండస్ట్రీకి ఎలా వచ్చేవాడు. ఒకవేళ వచ్చినా సినిమా నేపథ్యం లేకపోవడంతో తొక్కేసేవారు. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. తన మొదటి సినిమా ఈశ్వర్కి ఎలాంటి ఇబ్బంది లేదని అనిపించుకున్నాడు. రాఘవేంద్ర తదుపరి సినిమా కాస్త ఫ్లాప్ అయినప్పటికీ వర్షం సినిమాతో లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు.
ప్రస్తుతం, భారతదేశంలో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు పొందిన మొదటి హీరోగా ప్రభాస్ నిలిచాడు. బాహుబలి సిరీస్తో అతని పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఈ విషయం పక్కన పెడితే. ప్రభాస్ గురించి గతంలో కృష్ణంరాజు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. అదేంటంటే.. ప్రభాస్ కృష్ణంరాజు కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు రిలీజయ్యాయి. అందులో రెబల్, బిల్లా, రాధే శ్యామ్. అయితే బిల్లా సినిమా బాగానే ఉన్నా నెగెటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలియదు(Prabhas Krishnam Raju).
ఈ చిత్రానికి కృష్ణంరాజు స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు కృష్ణంరాజు మాట్లాడుతూ. అందుకే బిల్లా సినిమా చేసే టైంలో కూడా బడ్జెట్ పరంగా అన్నీ కరెక్ట్ గా చేశాను. కానీ ఒక ప్రభాస్ విషయంలోనే నాకు అదనంగా బడ్జెట్ పడింది. ఎందుకంటే షూటింగ్ కంప్లీట్ అయ్యాక తర్వాత రోజు న్యూ ఇయర్ అని తెలిసింది. దాంతో ప్రభాస్ కి పబ్బులో ఎంజాయ్ చేయాలి అని అనిపిస్తే స్వయంగా ప్రభాస్ కోసం ఒక బార్ ని రాత్రి మొత్తానికి బుక్ చేసి పెట్టాను.ఇక ప్రభాస్ కోసం బుక్ చేసిన ఆ బార్ బడ్జెట్ మాత్రమే నాకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
అంతే అంటూ కృష్ణంరాజు అప్పుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో కృష్ణంరాజు ప్రభాస్ కోసం ఏకంగా పబ్బునే బుక్ చేశారా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. సలార్ టీజర్ ప్రభావాన్ని వివరిస్తూ “గూస్బంప్స్” వస్తున్నాయని పేర్కొంటున్నారు. భారతదేశం, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా వివిధ ప్రదేశాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం అద్భుతమైన మాస్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా రూపొందింది.(Prabhas Krishnam Raju)
రూ.200 కోట్ల బడ్జెట్తో, నిర్మాణ బృందం విజువల్ ఎఫెక్ట్స్లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఫారిన్ స్టూడియో సేవలను వినియోగించుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించింది. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రూ.5 వేల కోట్లను సాధిస్తుందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.